తూర్పు గోదావరి, సర్పవరం (కాకినాడ రూరల్): కాకినాడ నగరంలోని గొడారిగుంట దుర్గానగర్లో ఈ నెల 19న అర్ధరాత్రి అత్యంత కిరాతకంగా లారీ డ్రైవర్ నక్కా బ్రహ్మానందం అనే బ్రహ్మాజీ (29) హత్యకు గురయ్యాడు. ఈ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. దీనిపై సర్పవరం పోలీసు స్టేషన్లో సోమవారం జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కరణం కుమార్, ఇన్చార్జి డీఎస్పీ వి.భీమారావు, సీఐ గోవిందరాజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. లారీ డ్రైవర్గా పనిచేసే బ్రహ్మానందం అతని మరదలు మంగలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి పాప, బాబు ఉన్నారు. వీరు గొడారిగుంట దుర్గానగర్లో అద్దింట్లో నివాసం ఉంటున్నారు. భార్య మంగలక్ష్మి కాకినాడ కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. అల్లవరం మండలం డి.రావులపాలెం గ్రామం సావరంపేటకు చెందిన ఈతకోటసూర్యప్రకాష్ అనే సూర్య డిగ్రీ పూర్తి చేసి కానిస్టేబుల్ అవుదామని కాకినాడలో ట్రైనింగ్కు వచ్చాడు.
అడ్డు తొలగించేందుకే హతమార్చారు